యాదవులకు ఎల్లవేళలా అండగా ఉంటాం….. మీ మద్దతు మాకు కావాలి : కేపి, ఉడుముల

అఖిల భారత యాదవ మహాసభ మద్దతు మాకు కావాలని మాజీ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి, ఉడుముల శ్రీనువాసులరెడ్డిలు కోరారు.

వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు స్ధానిక అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని సమావేశం జరుగుతున్న సమయంలో మాజీ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డిలు కార్యాలయానికి వచ్చి యాదవ మహాసభ మద్దతు కోరారు.

ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కెపి కొండారెడ్డి మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో మార్కాపురం నియోజకవర్గం నుండి నా కుమారుడు నాగార్జునరెడ్డికి వైయస్ఆర్సీపి టికెట్ ఖరారు చేసిందని……
ఖరారు అనంతరం తొలుత యాదవుల మద్దతు కోరుతూ మీ వద్దకు వచ్చానని కావున నాగార్జున రెడ్డిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనువాసులరెడ్డి లను గెలిపించాలని యాదవులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా నేను అండగా ఉంటానని…… అదేవిధంగా యాదవ భవన్ నిర్మాణం కొరకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులరెడ్డి మాట్లాడుతూ యాదవుల డిమాండ్లు ఏవైనా ఉంటే మాకు తెలియజేయండి…. మేము వాటిని పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తొలుత కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన కెపి, ఉడుములను అఖిలభారత యాదవ మహాసభ నాయకులు సత్కరించారు.

ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, శిరిమల్లే శ్రీనివాస్ యాదవ్, కనకం వెంకట్రావు యాదవ్, వీర్ల శ్రీనివాస్ యాదవ్, బలగాని నాగరాజు, పెమ్మని రాజు తదితరులు పాల్గొన్నారు.