కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా షేక్ సైదా అభ్యర్థిత్వం ఖరారు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో 114 మంది జాబితా తో తొలి జాబితాను విడుదల చేసింది

తొలి జాబితాలో మార్కాపురం నియోజకవర్గం అభ్యర్థిగా పొదిలి పట్టణానికి చెందిన షేక్ సైదా పేరు చోటు చేసుకుంది.

2019 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన షేక్ సైదా తిరిగి 2024 ఎన్నికల్లో కూడా అభ్యర్థిగా తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు