అఖిల భారత యాదవ మహాసభ మద్దతు కోరిన కందుల

అఖిల భారత యాదవ మహాసభ నాయకుల కార్యవర్గ సమావేశం పొదిలి అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయం నందు నిర్వహించారు.

ఈ సమావేశం జరుగుతున్న సమయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి సమావేశానికి వచ్చి తెలుగుదేశం పార్టీ అధిష్టానం టికెట్ ను నాకు కేటాయించింది కాబట్టి నియోజకవర్గంలో అధికశాతం ఓటర్లు కలిగి ఉన్న యాదవ సామాజికవర్గం నుండి మద్దతు ఇస్తే యాదవుల అభివృద్ధికి పాటుబడతానని ఆయన అన్నారు.

తొలుత మొదటిసారిగా కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయనను సత్కరించారు. అలాగే నియోజకవర్గంలోని పలు సమస్యలపై యాదవ మహాసభ నాయకులు, సభ్యులు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లగా ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధి చేసి చూపిస్తానని……. అలాగే యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో యాదవ మహాసభ నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, శిరిమల్లే శ్రీనివాస్ యాదవ్, కనకం వెంకట్రావు యాదవ్, వీర్ల శ్రీనివాస్ యాదవ్, బలగాని నాగరాజు, పెమ్మని రాజు తదితరులు పాల్గొన్నారు