శివాజీని వరించిన ఆయుర్వేద రత్న అవార్డు

ఆయుర్వేదంలో అన్ని రోగాలను నయం చేయవచ్చని అనుభవాలతో నిరూపిస్తున్న , అలాగే పూర్వీకుల నుండి వైద్య సేవలను అందిస్తున్న దరిశి శివాజీ కి ఆయుర్వేద రత్న అవార్డు వరించింది.

జాతీయ సాధకుల సమాఖ్య డిల్లీ వారు రాష్ట్రీయ ఆయుర్వేద రత్న అవార్డు -2021 కు పొదిలి పట్టణం చెందిన ఆయుర్వేద వైద్యులు దరిశి శివాజీని ఎంపీక చేసినట్లు తెలిపారు.

ఆగస్టు రెండో వారంలో కొత్త ఢిల్లీ నందు అవార్డు గ్రహీతలకు ప్రధానోత్సవం జరుగుతుందని సమాచారం అందించారు.

ఆయుర్వేద వైద్యులు దర్శి శివాజీకి గతంలో ఐకాన్ అవార్డ్ 2021 , నంది అవార్డులను అందుకున్నారు.