పొదిలి కొనకనమిట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నసీరుద్దీన్, సుబ్బారావు నియామకం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని పొదిలి, కొనకనమిట్ల మండలాలకు కాంగ్రెసు పార్టీ నూతన అధ్యక్షులను ఎంపిక చేసింది.

2019నుంచి పొదిలి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్న షేక్ నసీరుద్దీన్ ను తిరిగి పొదిలి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి నియామకం పత్రాన్ని అందజేశారు.

అదే విధంగా గత స్ధానిక సంస్థల ఎన్నికల్లో కొనకనమిట్ల జెడ్పీటీసీ పదవికి పోటీ చేసిన ధర్నాసీ సుబ్బారావుకు కొనకనమిట్ల మండల కాంగ్రెస్ అధ్యక్షులు గా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి నియామకం పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా పొదిలి కొనకనమిట్ల మండలాల అధ్యక్షులు షేక్ నసీరుద్దీన్, ధర్నాసీ సుబ్బారావులు పొదిలి టైమ్స్ మాట్లాడుతూ తమకు పదవి లభించటం పట్ల పిసిసి అధ్యక్షులు షర్మిల, జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సయ్యద్ జావేద్ అన్వర్ లకు కృతజ్ఞతలు తెలిపారు

పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు