అసదుద్దీన్ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు

ఎంఐఎం పార్టీ జాతీయ అధ్యక్షులు హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు కలకలం సృష్టించాయి.

వివరాల్లోకి వెళితే బెంగళూరు నందు గురువారంనాడు తలపెట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా “రాజ్యాంగాన్ని రక్షించాలి ” అనే నినాదంతో తలపెట్టిన సభకు ముఖ్య అతిథిగా హాజరైన అసదుద్దీన్ ఒవైసీ సమక్షంలో అమూల్య అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయడంతో అప్రమత్తమైన అసదుద్దీన్ ఆమె చేతిలోని మైకును లాక్కునే ప్రయత్నం చేయగా అంతలోనే పోలీసులు వచ్చి ఆమె అదుపులో తీసుకున్నారు.

అనంతరం అసదుద్దీన్ ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ ఆమె మా పార్టీకి చెందిన వ్యక్తి కాదని…. ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని‌ తెలిపారు.