ఉగ్రకు ఘన స్వాగతం పలిగిన తెలుగు తమ్ముళ్లు

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. వివరాల్లోకి వెళితే శనివారం నాడు అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరుటకు కనిగిరి నుండి భారీ కాన్వాయితో బయలుదేరిన ఉగ్ర నరసింహారెడ్డికి పొదిలి పెద్ద బస్టాండ్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి నాయకత్వంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్ళుర్పించిన ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలనే ఆకాంక్షతోనే తాను తెదేపా చేరుతున్నానని రాబోయే ఐదు సంవత్సరాలలో పూర్తి కాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు షేక్ రసూల్, షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు.