ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న నాగుర్ భాషా

 పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

జిల్లా ఉత్తమ   ప్రతిభా పురస్కారాన్ని షేక్ నాగుర్ భాషా అందుకున్నారు.

వివరాల్లోకి వెళితే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బంగోలు పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో మర్రిపూడి పోలీసు స్టేషన్ నందు కానిస్టేబుల్ గా పనిచేస్తున్న షేక్ నాగుర్ భాషా జిల్లా ఉత్తమ పోలీసు గా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు యస్పీ మలిక  గార్గ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.