సైకిల్ యాత్రను జయప్రదం చేయండి – టిడిపి నేత శ్యాం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తలపెట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర పొదిలి పట్టణంలోకి గురువారం నాడు రానున్న నేపథ్యంలో సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని ప్రకాశం తెలుగు దేశం పార్టీ యస్సీ సెల్ అధ్యక్షులు చుండి శ్యాం పిలుపునిచ్చారు
తొలిత ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో యస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అఖిల్, నాయకులు బూదల జాన్ డేవిడ్, రత్నం, జ్యోతి మల్లిఖార్జునరావు, ఠాకూర్ నాగేశ్వరరావు, గాలిముట్టి నరసింహారావు, అరిగ రాము, సూరయ్య తదితరులు పాల్గొన్నారు