రేపు జనసేన ర్యాలీ…… కార్యకర్తల సమావేశం

జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పొదిలిలోని స్థానిక మార్కాపురం అడ్డరోడ్డు నుండి ర్యాలీగా బయలుదేరి విశ్వనాథపురం, పెద్దబస్టాండ్, చిన్నబస్టాండ్ మీదుగా………..

కాటూరివారిపాలెం ఆంజనేయస్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం కాటూరివారిపాలెం గ్రామంలోని కళ్యాణమండపం నందు కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు ముల్లా బాజి కరిముల్లా, షేక్ కాలేషాలు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఇమ్మడి కాశీనాధ్ ముఖ్యఅతిధిగా పాల్గొంటారని…….. జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రకటనలో కోరారు.