అంగరంగ వైభవంగా పృధులగిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

పృధులగిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన బుధవారంనాడు ఉదయం నుండే వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వివిధ సమాజికవర్గాలకు చెందిన ఉచిత అన్నదాన సత్రాలలో కులమతాలకు అతీతంగా ఉచితంగా భోజనం ఏర్పాటు చేసి…… పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన సత్రాల నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమం బ్రహ్మోత్సవాలు ముగిసేంతవరకు నిర్వహించడం జరుగుతుందని….. వేలాదిమంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని వినియోగించుకోవడం జరుగుతుందని అన్నారు.