ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న దుర్గా ప్రసాద్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

ప్రకాశం జిల్లా ఉత్తమ  ప్రతిభా పురస్కారాన్ని పొదిలి కి చెందిన దుర్గా ప్రసాద్ అందుకున్నారు.

వివరాల్లోకి వెళితే గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని బంగోలు పెరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పురస్కార సభలో  జిల్లా ఉత్తమ   పురస్కారాన్ని  పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయం నందు సుదనగుంట గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వై దుర్గా ప్రసాద్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు యస్పీ మలిక  గార్గ్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.