పంచాయతీ ఒప్పంద కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని ధర్నా

పంచాయతీ ఒప్పంద కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని సిఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

వివరాల్లోకి వెళితే స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారంనాడు పంచాయతీ ఒప్పంద కార్మికులు తమకు రావలసిన వేతన బకాయిలను చెల్లించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ వేతన బకాయిలు చెల్లించకపోవడంతో తమ కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి ఏర్పడిందని అధికారులు స్పందించి తమకు పెండింగులో ఉన్న జీతాలను చెల్లించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్, సిఐటీయూ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.