18న యాదవ మహాసభ కీలక సమావేశం…. ఇప్పటికే మద్దతు కోరిన ఇమ్మడి ,ఉడుముల

అఖిల భారత యాదవ మహాసభ కీలక సమావేశం ఆదివారం ఉదయం స్ధానిక యాదవ మహాసభ కార్యాలయంలో జరగనున్నది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో అనుసరించే అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించే విధంగా సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.

ఇప్పటికే జనసేన పార్టీ తరుపున పోటీ చేస్తారని భావిస్తున్న ఇమ్మడి కాశీనాధ్ తమ యొక్క మద్దతు కావాలని బిసి అభ్యర్థి అయిన నాకు మీ మద్దతు తెలపాలని కోరగా…. మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనువాసులురెడ్డి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న తన అల్లుడు కుందూరు నాగార్జునరెడ్డికి మద్దతు తెలపాలని కోరారు.

అయితే ఈ సమావేశంలో సమాజ్ వాది పార్టీ బి ఫాం మీద స్వంతంగా పోటీ చేయడం లేదా బిసి అభ్యర్థి అయిన ఇమ్మడికి మద్దతు తెలపడమా లేక వైసీపీతో మద్దతు తెలపడమా అనే విషయం ఈ కీలక సమావేశం అనంతరం తేలనుంది