అభినందన్ ను భారత్ కు అప్పగించిన పాక్….

భారత వాయుసేన వింగ్ కామాండర్ అభినందన్ ను పాక్ అధికారులు శుక్రవారం నాడు సాయంత్రం భారత్ కు అప్పగించారు.

గురువారం జరిగిన పాక్ పార్లమెంట్ సమావేశంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ మాట్లాడుతూ శుక్రవారం నాడు అభినందన్ ను భారత్ కు అప్పగిస్తామని తెలిపిన విషయం తెలిసిందే…..

ఈ నేపథ్యంలోనే వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికారులు…. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఐదుగురు భారత అధికారులకు అప్పగించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన అనంతరం వాయుసేన వింగ్ కామాండర్ అభినందన్ ను తీసుకుని అమృత్ సర్ బయలుదేరారు ఐఏఎఫ్ అధికారులు.

అభినందన్ విడుదల సందర్భంగా భారత ప్రజలు ఆహ్వానం పలికేందుకు వాఘా సరిహద్దు చేరుకున్నారు. అభినందన్ భారత్ లో అడుగుపెట్టగానే వాఘా సరిహద్దుల్లో పండగ వాతావరణం నెలకొంది. సంగీతం, నృత్యాలతో ప్రజలు అభినందన్ కు ఘన స్వాగతం పలికారు.