టిడిపి ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  అక్రమ అరెస్టు పట్ల రామ్ నగర్ నందు టిడిపి నాయకులు ముని శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి వెళ్ళి కరపత్రాలను పంపిణి చేశారు

తొలిత స్థానిక యోగయ్య స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి రామ్ నగర్ నందు ఇంటి ఇంటికి వెళ్ళి కరపత్రాలను పంపిణీ చేసారు

ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి వెంకట నారాయణ బాబు, యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సమంతపూడి నాగేశ్వరరావు,ఆవులూరి యలమంద, ముని శ్రీనివాస్, ఆరిగ రాము మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు