కాంగ్రెస్ లో చేరిన కుంచాల నాగరాజు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ జిల్లా దళిత నాయకులు కుంచాల నాగరాజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్కాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు షేక్ సైదా సమక్షంలో గురువారం నాడు పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు

ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ కుంచాల నాగరాజు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ స్వర్గీయ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సానికొమ్ము పిచ్చిరెడ్డి శిష్యుడిగా మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ వాదిగా కాంగ్రెస్ పార్టీలో 2019 ఎన్నికల వరకు పనిచేశారు గతంలో కుంచాల నాగరాజు కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించారని, 2004లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా, 2017-18 లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించారని ఆయన అన్నారు.

2019 ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారనీ ప్రస్తుత పరిస్థితుల్లో నాగరాజు సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో అవసరం అని ఆయనకి పార్టీలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని సైదా అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కుంచాల నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే దళితులకు బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు రక్షణగా వారి సంక్షేమం కోసం పాటుపడుతుందని అందువలననే నేను కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నానని ఆయన అన్నారు .

నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పొదిలి మండలంలో కాంగ్రెస్ పార్టీ పురోభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కుంచాల నాగరాజు అన్నారు.