పొదిలి పట్టణంలో తొలి కోవిడ్ మృతి

వివరాల్లోకి వెళితే స్థానిక పిఎన్ఆర్ కాలనీలో కోవిడ్ కేసు నమోదయిన ఓ వ్యక్తి(52) సోమవారంనాడు రాత్రి ఒంగోలు కోవిడ్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు వైద్యాధికారుల ద్వారా సమాచారం.


పట్టణంలో కఠిన ఆంక్షలు విధిస్తూ అధికారులు రెడ్ జోన్ లు మరియు హై రిస్క్ రెడ్ జోన్ లు ఏర్పాటు చేసి లాక్ డౌన్ నిర్వహిస్తున్నప్పటికి ప్రజలు అప్రమత్తంగా లేకపోవడంతో కోవిడ్ కేసులు రోజురోజుకు పెరగడానికి ప్రధాన కారణంగా తెలుస్తుండగా….. అధికారులు మాత్రం రేపటి నుండి అత్యంత కఠినంగా లాక్ డౌన్ కొనసాగించనున్నారు.