రామ జన్మభూమి తీర్థ క్షేత్ర‌ ట్రస్ట్ కరపత్రం ఆవిష్కరణ

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర‌ ట్రస్ట్ కరపత్రాన్ని హిందూ సంస్థల నాయకులు ఆవిష్కరించారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్థానిక శివాలయం నందు అయ్యోధ్యలో రామమందిరం నిర్మాణం పనుల కోసం రామ జన్మభూమి తీర్థ క్షేత్ర‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జనవరి 15వ తేది నుండి ఫిబ్రవరి 27 వరకు ప్రతి ఇంటి నుంచి విరాళాలు సేకరించే ప్రక్రియకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించి లాంఛనంగా ‌విరాళాల ప్రక్రియ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో పట్టణం చెందిన హిందూ సంస్ధల నాయకులు తదితరులు పాల్గొన్నారు.