పికె టీంతో కెపి కొండారెడ్డి భేటీ…… 15న జంకె, కెపిలతో ఉమ్మడి సమావేశం

ప్రశాంత్ కిషోర్ టీంతో జూబ్లిహిల్స్ లోని పికె కార్యాలయంలో గురువారం సాయంత్రం 7గంటల నుండి సుమారు గంటన్నర సేపు సమావేశం జరిగిందని సమాచారం.

ప్రశాంత్ కిషోర్ బృందంతో కేపి జరిపిన సమావేశంలో కీలకమైన పలు అంశాలు చర్చించినట్లు సమాచారం. పీకే టీం కెపి కొండారెడ్డి వైపు సానుకూలంగా ఉన్నారని 15తేదీన ప్రస్తుత శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి కొండారెడ్డిలతో ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థితత్వం ఖరారు చేస్తారని సమాచారం. ఏమైనా మార్కాపురం నియైజకవర్గం వైయస్ఆర్ సిపి అభ్యర్థి ఖరారు విషయం 15వ తేది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.