పడమటిపాలెంలో డీప్ బోర్లను ప్రారంభించిన కందుల

పట్టణంలోని స్థానిక పడమటిపాలెం నందు బుధవారం నూతనంగా వేసిన డీప్ బోర్లను మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షేక్ షహనాజ్, ముల్లా ఖుద్దూస్, ముల్లా షరీఫ్, ఉదయ్ శంకర్, మహబూబ్ బాషా, బుడ్డు జిలాని, షేక్ సందాని, షేక్ గౌస్ తదితరులు పాల్గొన్నారు.