తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణశాఖ “హికా” తుఫాను హెచ్చరికలు

దక్షిణ భారతదేశంలో బీభత్సం సృష్టించేందుకు రాగల 24గంటలలో ఏపీ, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో “హికా” తుఫాను వలన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

“హికా” తుఫాను ప్రభావంతో అరేబియా తీరంలో గంటకు 75నుంచి 85కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు…. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

మరో 48గంటల్లో తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తాయని…. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, చత్తీస్‌ఘడ్, బెంగాల్‌లో కుంభవృష్టిగా వర్షాలు పడే అవకాశం ఉందని…… అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని…… బీహార్, జార్ఖండ్, బెంగాల్ లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశముందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆల్ ఇండియా వార్నింగ్ బులిటెన్ లో భారత వాతావరణశాఖ తెలిపింది.