టిడిపి ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి బాబు కార్యక్రమం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ పొదిలి పట్టణం 1వ వార్డు నందు మాజీ జెడ్పిటిసి సభ్యులు కాటూరి వెంకటనారాయణ బాబు బూత్ కన్వీనర్ అరిక రాము,కాటూరి శ్రీను, ఖాదర్ వలీ నాయకత్వంలో ఇంటింటికి బాబు కరపత్రాలను పంచి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రజలను వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో సైకో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని కోరుతూ ప్రచారం నిర్వహించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మాజీ శివాలయం చైర్మన్ సమంతపూడి నాగేశ్వరావు, రాష్ట్ర తెలుగు రైతు కార్యదర్శి యలమంద, జిల్లా కార్యదర్శి పొల్ల నరసింహరావు, జిల్లా మైనార్టీల అధ్యక్షులు షేక్ రసూల్ మహమ్మద్ అధికార ప్రతినిధి షేక్ యాసిన్,ముల్లా జిలాని బాషా,గోపాల్ రెడ్డి, ఇల్లులు,ముని శ్రీను,హాజరాత్, గుర్రం ప్రసన్న కుమార్ యూత్ నాయకులు,కాలేషా,మాబు, పచ్చా, రబ్బానీ,గౌస్,మహిళలు, పాల్గొన్నారు.