దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి ఘనంగా వేడుకలు

దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

ప్రజలు జాతిపిత సేవలు, ఆశయాలను స్మరించుకున్నారు.

దిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా నివాళులర్పించారు మరియు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అనిల్‌ శాస్త్రి, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా వంటి పలువురు ప్రముఖులు శ్రద్దాంజలిఘటించి
అనంతరం జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సత్యం, అహింసలే ఆయుధాలుగా దేశ స్వాతంత్ర్య సంగ్రామ సారథిగా జనసంద్రాన్ని కదిలించిన మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

జాతిపిత జయంతి ఉత్సవాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.