బాలిక బుగ్గకొరికిన యువకుడికి 11నెలల జైలు, జరిమానా

ముంబై : ముంబై నగరంలో ఓ బాలిక బుగ్గను కొరికి గాయపరిచిన యువకుడికి పోస్కో ప్రత్యేక కోర్టు జడ్జి 11 నెలల జైలు శిక్ష విధించిన సంఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే ముంబై నగరానికి చెందిన ఓ బాలిక(17) తల్లిదండ్రులు దైవదర్శన నిమిత్తం ఆలయానికి వెళ్లగా… పరీక్షలకు సిద్దమవుతున్న బాలిక ఇంట్లోనే ఉండి చదువుకుంటున్న సమయంలో….. బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన ఓ యువకుడు (21) ఇంట్లోకి చొరబడి బాలిక బుగ్గపై కొరికి గాయపరచి పరారయ్యాడు.

బాలిక తల్లిదండ్రులు ఆలయం నుండి రాగానే విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపి వారితో కలిసి స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

నిందితుడైన యువకుడిపై ఐపీసీ 354 ఎ, 448,పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి ముంబై ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా…. ఈ కేసును వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతాశర్మ బాలిక బుగ్గపై యువకుడు కొరకడంతో అయిన గాయానికి సంబంధించిన మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించగా….. విచారణ అనంతరం నిందితుడైన యువకుడు బాలిక ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడమే కాకుండా ఆమె బుగ్గ కొరికి గాయపరచినందుకు 11నెలల జైలుశిక్ష మరియు 1000రూపాయల జరిమానాను విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.