హెలిప్యాడ్ పనులను పరిశీలించిన వైసిపి నేతలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 28న పొదిలి కి రానున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన హెలిప్యాడ్ పనులను ప్రారంభించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, మార్కాపురం నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమన్వయకర్త అన్నా రాంబాబు మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి , రాష్ట్ర పార్టీ కార్యదర్శి కెవి రమణా రెడ్డి, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసులురెడ్డిలు పనులను పరిశీలించారు.

యుద్ధప్రాతిపదికన హెలిప్యాడ్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్ళు పని చేస్తున్నారు