వాతావరణం నేపథ్యంలో జగన్ పర్యటన వాయిదా – జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే28వ తేదిన పొదిలి పర్యటన ను భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా నేపథ్యంలో వాయిదా వేసినట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి స్థానిక పొదిలి పట్టణంలోని హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన
మీడియా సమావేశంలో తెలిపారు
జూన్ మొదటివారంలో జగన్ మోహన్ రెడ్డి పొదిలి పర్యటన ఉంటుందని మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్నా రాంబాబు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులురెడ్డి రాష్ట్ర పార్టీ కార్యదర్శి కెవి రమణా పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి , కొనకనమిట్ల జెడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వై వెంకటేశ్వరరావు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు