మద్యం కుంభకోణాన్ని డైవర్ట్ చెయ్యడానికే జగన్ రెడ్డి పొదిలి పర్యటన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మద్యం కుంభకోణాన్ని డైవర్ట్ చెయ్యడానికే జగన్ రెడ్డి పొదిలి పర్యటన _ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి

మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సోమవారం నాడు సందర్శించారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వేలం ప్రక్రియ ముగిసేంతవరకు పొదిలి బోర్డులోనే ఉండి బయ్యర్లతో కలిసి పొగాకు కొనుగోలు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు.

దాదాపు ఐదు గంటల పాటు పొదిలి బోర్డు లోనే ఉండి స్వయంగా రైతులకు లాభం చేకూర్చే విధంగా దాదాపు బేలు కొనుగోలు అయ్యేటట్లు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఎల్ఏ కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఈ సీజన్ కు 11 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి పొగాకు పర్మిషన్ ఇస్తే రైతులు దాదాపు 18 మిలియన్ల పొగాకు ను పండించారని అన్నారు

బయర్లు ఈ సీజన్ కు లో లో గ్రేడ్ పొగాకును కొనడానికి కొంత ఆసక్తి చూపించలేదని ఈనెల 20వ తేదీన 14 బెళ్ళ, 21వ తారీఖున 15 బేళ్లు, 22వ తారీఖున 17 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారని తరువాత తాను వచ్చి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి ఒప్పించి మెప్పించి 24వ తేదీన 72 బేళ్లు, 26వ తేదిన 133 బెళ్ళ లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేశారని అదే రకంగా అన్ని కంపెనీలు ఈనెల 20వ తేదీన 72 0 బేళ్లు, 21 వ తేదీన 840 బేళ్లు, 22 వ తేదీన 684 బేళ్లు, 23 వ తేదీన 1000 బేళ్లు, 24 వ తేదీన 1090 బేళ్లు ఈ రోజున 1100 బేళ్లు అన్ని రకాల పొగాకు కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేశారని ఓ పద్ధతి ప్రకారం కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి వారిని ఒప్పించి మెప్పించి గ్రాడ్యువల్ గా కొనుగోళ్ళను పెంచుతున్నామని అన్నారు.

ఏదో ఇక్కడ జరిగిపోతున్నట్టు ఎల్లుండి వైసిపి నాయకులు పర్యటన చేయబోతున్నారని గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణాన్ని డైవర్ట్ చేసేందుకు జగన్ రెడ్డి పొదిలికి వస్తున్నారని డైవర్ట్ పాలిటిక్స్ వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.

రైతులు దిగులు చెందవలసిన అవసరం లేదని ప్రతి పొగాకు బెళ్ళ ను కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.

గత వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం, మట్టి మాఫియా, ఇసుక మాఫియా లు రాష్ట్రాన్ని పట్టిపీడించారని ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయని అన్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇన్ని రోజులు ఈ వైసీపీ నాయకులు ఎక్కడికి పోయారని తమ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి విచ్చేసి ప్రతి పొగాకు బెలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు

.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, రైతులు రైతు నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.