యోగా శిక్షణా తరగతులు ప్రారంభం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మున్సిపల్ పరిధిలో అంగన్వాడీ, సచివాలయం ఉద్యోగులకు యోగా శిక్షణా తరగతులను ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాల నందు మంగళవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు.
మూడు రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని మున్సిపల్ కమిషనర్ కెయల్ నారాయణరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతి రావు, పిఈటి మాస్టర్ ముండలమూరి ప్రసాద్, మరియు అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు