మే 28న మాజీ సిఎం జగన్ పర్యటన ఖరారు| ఏర్పాట్లు పరిశీలించిన మాజీ మంత్రులు జిల్లా నాయకులు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

మే 28న పొదిలి పట్టణంలోని పొగాకు వేలం కేంద్రంలో రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో, గురువారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

మాజీ మంత్రులు కారుమూరు నాగేశ్వరరావు, ఆదిమూలపు సురేష్, జిల్లా వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ సమయకర్త దద్దాల నారాయణ యాదవ్, మార్కాపురం నియోజకవర్గ నాయకులు అన్నా కృష్ణ చైతన్య,వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కెవి రమణా రెడ్డి, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి సానికొమ్ము శ్రీనివాసులురెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వై వెంకటేశ్వరరావు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, మాజీ సీఎం జగన్ రాకకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.

అనంతరం పొగాకు వేలం అధికారి గిరిరాజును కలిసి, మే 28న జగన్ పర్యటన సమయంలో రైతులతో భేటీ కార్యక్రమానికి అధికారిక అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా, రైతుల సమస్యలపై చర్చలు జరిపి, వారి డిమాండ్లను మాజీ సిఎం జగన్‌ కు ముందస్తుగా అందజేయడానికి తగిన ప్రణాళికలు రూపొందించారు.

అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన షెడ్యూల్ వివరాలను మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు యాదవ్ మీడియాకు తెలిపారు