కొనకనమిట్ల మండల టిడిపి అధ్యక్షులుగా మూరబోయిన బాబురావు యాదవ్ ఎన్నిక
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కొనకనమిట్ల మండలం తెలుగు దేశం పార్టీ అధ్యక్షులుగా మూరబోయిన బాబురావు యాదవ్ ఎంపికయ్యారు.
మార్కాపురం లో జరిగిన మార్కాపురం నియోజకవర్గ స్థాయి తెలుగు దేశం పార్టీ మినీ మహానాడు లో కొనకొనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులుగా మూరబోయిన బాబురావు యాదవ్ ను ఏకగ్రీవంగా ఎంపికైనట్లు శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ప్రకటించారు.
పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మండల పార్టీ అధ్యక్షులుగా మూరబోయిన బాబురావు యాదవ్ నియమించటం తదనుగుణంగా పార్టీ పటిష్టపరిచి 2024 ఎన్నికల్లో కొనకొనమిట్ల మండలం లో టిడిపి మెజారిటీ సాధించే దిశగా పని చేసిన బాబురావు కు మరోసారి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్ష పదవిని కట్టబెట్టారు.