డయల్ యువర్ డిఎం పొదిలి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయం, విజయవాడ వారి ఉత్తర్వుల అనుసరించి ఈ నెల 13 వ తేదీ 2025 అనగా మంగళవారం నాడు డయల్ యువర్ డిఎం కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జరుగుతుందని పొదిలి డిపో మేనేజర్ శంకరరావు తెలిపారు.

ఈ అవకాశమును వినియోగించుకొని పొదిలి డిపో అభివృద్ధికి తమ విలువైన సలహాలు, సూచనలను డిపో మేనేజర్ వారి మొబైల్ నెంబరు 99 59 22 57 0 0 నకు ఫోన్ చేసి డయల్ యువర్ డిఎం కార్యక్రమం ద్వారా తెలుపగలరని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు

కావున యావన్మంది ప్రజలు, ప్రయాణికులు పొదిలి డిపో బస్సులు తిరుగు ప్రదేశములవారు పొదిలి డిపో బస్సులలో వారి వారి గమ్య స్థానాలకు ప్రయాణించేవారు వారి యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు తెలుపుచూ ఈ కార్యక్రమం ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నామని అన్నారు