జీఓఎంఎస్ నెంబర్ 4ను రద్దు చెయ్యాలి – గ్రామ రెవెన్యూ అధికారల సంఘం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
రాష్ట్ర ప్రభుత్వం రేషన్లైజేషన్ క్లస్టర్ విధానంలో వీఆర్వోల క్యాడర్ ను తగ్గిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ నాలుగును వ్యతిరేకిస్తూ స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయం నందు తహశీల్దార్ కృష్ణరెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు
ఈ సందర్భంగా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా నాయకులు కిలారి సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వ సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన జీవో నెంబర్ 4 వల్ల వి.ఆర్.ఓ.ల కేడర్ కు, ప్రమోషన్లుకు, మరియు మిగులు సిబ్బందిగా వీఆర్వోలను నియమించుట గురించి మిగులు సిబ్బంది సమస్య కాల్గకుండా ఉన్న విఆర్వోలు కూడా పని ఒత్తిడికి గురయ్య ప్రమాదం ఉందని అన్నారు
క్లస్టర్ విధానంలో జరుగుతున్న లోపాలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లిన, రాష్ట్ర ఉన్నతాధికారులకు విన్నవించిన కానీ ప్రభుత్వం జీవో నెంబర్ నాలుగు విడుదల చేయడంతో తాము తీవ్ర ఆందోళనలో ఉన్నామని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 4ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు కిలారి సుబ్బారావు,బాల వెంకటరెడ్డి, అనీల్, సుబ్బారావు, సురేష్, మురళి, తదితరులు పాల్గొన్నారు