ఫ్లోరోసిస్ పరికరాలు వినియోగం పై రాజుపాలెం లో ఆరోగ్య బృందం పర్యటన

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

ఉప్పలపాడు , పొదిలి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని రాజుపాలెం గ్రామం నందు గతంలో ఫ్లోరోసిస్ బాధితులకు రీ హ్యాబిటేషన్ ఎక్విప్మెంట్ ను అందజేయగా సదరు విషయం పై గురువారం నాడు ఎక్విప్మెంట్ను జిల్లా ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్ వేము అనిల్ కుమార్ బృందం గ్రామంలో పర్యటించారు

గ్రామంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వారి వద్ద ఉన్న పరికరాలను పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ అనీల్ కపూర్ మాట్లాడుతూ 2024 – 2025 స్కూల్ సర్వే కమ్యూనిటీ సర్వేను నిర్వహించి ఫ్లోరిసిస్ బాధితులైన వారికి 24 వీల్ చైర్స్, 22 వాకర్సు, 21 వాకింగ్ స్టిక్స్, 18 వెస్ట్రన్ కమోడిటీలను అందజేసినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా వాటిని పరిశీలించారు.. కొత్త ఇన్స్ట్రుమెంట్ కూడా వస్తాయని అవసరమైతే వాటిని కూడా ప్లోరోసిస్ బాధితులకు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా బాధితులు పరిశుభ్రమైన తాగునీరు, ఆహార నియమాలను కచ్చితంగా పాటించాలి అన్నారు

 

ఈ కార్యక్రమంలో ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారిణి డాక్టర్ ఎం సుగుణ కుమార్, పొదిలి అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరత్ చంద్ర, సూపర్వైజర్, ఏఎన్ఎంలు ఆశాలు రాజుపాలెం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు