పశుగ్రాసం తొలగింపుపై రైతుల ఆవేదన: రెవెన్యూ అధికారులు చర్యలు
పశుగ్రాసం తొలగింపుపై రైతుల ఆవేదన: రెవెన్యూ అధికారులు చర్యలు
పొదిలి మండలం కుంచేపల్లి మరియు దాసల్లపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలోని వాగు పోరంబోకు భూమిలో స్థానిక రైతులు పశువుల మేత కోసం పెంచుకున్న పశుగ్రాసం పై వివాదం ఏర్పడింది. ఈ భూమిలో అక్రమ సాగును ఆపాలని తహశీల్దార్ కు ఫిర్యాదు వచ్చిన తర్వాత, రెవెన్యూ శాఖ అధికారులు JCB (యంత్రం) సహాయంతో పశుగ్రాసాన్ని తొలగించింది. ఈ చర్యతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు
స్థానిక రైతు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ, *”మూసీ వాగుకు పడమర వైపు 2 కిలోమీటర్ల పరిధిలో పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. మేము తూర్పు ప్రాంతంలో పశువుల మేత కోసం పశుగ్రాసం పెంచుకుంటున్నాము. ఇంకో నెలలోపు దిగుబడి పూర్తవుతుంది కాబట్టి సమయం ఇవ్వాలని అధికారులను కోరాం. కానీ మా మాట వినకుండా JCBతో పశుగ్రాసాన్ని నాశనం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు
“అక్రమ సాగుపై చర్య”
పొదిలి తహశీల్దార్ కృష్ణ రెడ్డి ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ కుంచేపల్లి, దాసల్లపల్లి గ్రామాల పరిధిలోని 17.36 ఎకరాల వాగు పోరంబోకు భూమిలో అక్రమ సాగు జరుగుతోంది. ఇది ప్రభుత్వ భూమి. దీనిపై ముందుగా నోటీసులు జారీ చేసి, నియమాల ప్రకారం తొలగింపు చర్యలు తీసుకున్నాం. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు.
తొలగింపు ప్రక్రియ సమయంలో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పొదిలి ఎస్ఐ వేమన ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
వాగు పోరంబోకు భూమి వివాదాలు గతంలోనే ఉన్నాయి. స్థానిక రైతులు పశువుల మేతకు ఈ భూమిని ఉపయోగిస్తున్నప్పటికీ, అక్రమ సాగు వివాదాలు వచ్చాయి. రెవెన్యూ శాఖ ప్రకారం, ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నంలో ఈ చర్య తీసుకోవలసి వచ్చిందని రెవెన్యూ అధికారులు వెల్లడించారు