బాలినేని యువసేన ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సంతకాల సేకరణ

బాలినేని యువసేన జిల్లా అధ్యక్షులు సుబ్బనాచారి ఆధ్వర్యంలో పొదిలి బస్టాండ్ నందు ప్రత్యేక హోదాకై సంతకాల సేకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆర్టీసీ మాజ్దూర్ యూనియన్ ప్రాంతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సంజీవరావు, నాయకులు విజయ భాస్కర్ రెడ్డి, నాగేశ్వరరావు, ఎంకే రావు, ఎస్ ఎస్ రెడ్డి, జయప్రసాద్, షేక్ మస్తాన్ వలి, జక్కిరెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.