యువకుడు ఆత్మహత్య

మర్రిపూడి మండలం కాకర్ల గ్రామం నందు ఉరి వేసుకొని యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మర్రిపూడి మండలం కాకర్ల గ్రామానికి చెందిన తుళ్లూరి శ్రీనివాసరావు (30) ఉరి వేసుకొని మృతి చెందడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా మర్రిపూడి యస్ఐ కె మాధవరావు సంఘటన స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.