సంఘీభావ పాదయాత్రకు వైసీపీ పిలుపు

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపుకు చేరుకున్న సందర్భంగా మండలంలోని అన్నవరం గ్రామం నుండి చింతగంపల్లి వరకు సంఘీభావ పాదయాత్ర జరగనుందని ఈ సంఘీభావ పాదయాత్రలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని జడ్పీటీసీ సభ్యులు సాయి రాజేశ్వరరావు, మండల కన్వీనర్ గుజ్జుల సంజీవరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు.