పారామిలటరీ బలగాలతో కవాతు నిర్వహించిన పొదిలి పోలీసులు

రానున్న ఎన్నికల నేపథ్యంలో పొదిలి సిఐ చిన్న మీరాసాహెబ్ ఆధ్వర్యంలో పారా మిలటరీ బలగాలతో పొదిలి పోలీసు స్టేషన్ నుండి పెద్దబస్టాండ్ మీదుగా చిన్న బస్టాండ్ తిరిగి పోలీసు స్టేషన్ వరకు కవాతు నిర్వహించారు.

ఈ సందర్భంగా పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్న మీరాసాహెబ్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో ప్రతి ఒక్క ఓటరు తన ఓటుహక్కును ఎటువంటి భయం లేకుండా వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని అన్నారు ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరిగినా మా దృష్టికి తీసుకుని రావాలని ప్రజలకు సూచించారు.

ఎస్ఐ శ్రీరామ్ మాట్లాడుతూ మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పారామిలటరీ బలగాలు మోహరించి ఉంటాయి కాబట్టి ప్రజలు ఎటువంటి భయాలకు గురి కావలసిన అవసరం లేదని…. ప్రజలు తమ ఓటును వినిగించుకోవడంలో ఎటువంటి సమస్యలు తలెత్తినా సమాచారం అందిస్తే తక్షణమే సంబంధిత స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు.

ఈ కవాతులో ఏఎస్ఐ వదూద్, కానిస్టేబుళ్లు, పారా మిలటరీ బలగాలు తదితరులు పాల్గొన్నారు.