ఒక అవకాశం ఇవ్వండి : జనసేన అభ్యర్థి ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇమ్మడి కాశీనాధ్ నాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి మార్కాపురంలోని ఇమ్మడి స్వగృహంలో ఆయనను కలిసిన పొదిలి టైమ్స్ ప్రతినిధితో మాట్లాడుతూ తమది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమని……..తన తాత నక్కా వెంకటయ్య (లండన్ వెంకటయ్య) 1951లో కృషికార్ లోక్ పార్టీ తరుపున మార్కాపురం నియోజకవర్గంలో తొలి శాసనసభ్యులుగా ఎన్నికవగా, 1955లో మద్రాసు రాష్ట్రం విభజన జరిగిన తరువాత ఏర్పడిన యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి తొలి శాసనసభ్యులుగా విజయం సాధించారు.

అదేవిధంగా తన మామ వెలుగొండ ప్రాజెక్టు ప్రదాత జిల్లాలో అత్యంత సూపరిచితుడైన పూల సుబ్బయ్య
యర్రగొండపాలెం నుండి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 1962 ,1967లో……. మార్కాపురం నుండి 1977లో గెలుపొందారాని అన్నారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 25కేజిల బియ్యం కోసం కాకుండా 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీని ఏర్పాటు చేశారని……. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశం లాగా కావాలని కులమతాలకు అతీతంగా ఒక బలమైన దేశం తయారు కావలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి జనసేన పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్లాలని…… ఆ దిశగా నేను మార్కాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే నేను ఎదోఒక రూపేణా మీ ఋణం తీర్చుకుని మీ సేవ చేసుకుంటానని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.