ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

 

విశ్వనాధపురంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని భవిత విద్యా కేంద్రం నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ పొదిలి ఎస్.సి.రాఘవేంద్ర ఆదేశాల మేరకు పొదిలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు భవిత విద్యా కేంద్రం నందు పిల్లలకు పండ్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ న్యాయవాదులు మాట్లాడుతూ భవిత కేంద్రంలోని పిల్లలు సాధారణ పిల్లలలా ఎదిగేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులుదే అన్నారు. అదే విధంగా ప్రత్యేక అవసరాలు లేని విధంగా చిన్నారులు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, న్యాయవాదులు శ్రీపతి శ్రీనివాసరావు, రాఘవరావు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.