గుర్తుతెలియని వాహనం ఢీకొని మోటారు సైక్లిస్ట్ మృతి

కొనకనమిట్ల మండలం మునగపాడు – నాగరాజుకుంట మార్గం మధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొని బసవాపురం గ్రామానికి చెందిన సుబ్బయ్య (35) అక్కడికక్కడే మృతి చెందాడు. తన స్వగ్రామం నుండి ద్విచక్ర వాహనంపై పొదిలి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.