ఎన్నికల శిక్షణ తరగతులు నిర్వహించిన తహశీల్దార్

ఎన్నికల శిక్షణ తరగతులను పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ ఎస్ యం హమీద్ నిర్వహించారు. వివరాల్లోకి వెళితే ఖంభాలపాడు స్థానిక బెల్లంకొండ విద్యాసంస్థల నందు పోలింగ్ అధికారులకు పోలింగ్ అధికారుల విధివిధానాలు, నియమాలు తదితర అంశాలపై మొదటి విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ అధికారులు, సహ పోలింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.