ఏపీపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణా తరగతులు ప్రారంభించాం : వైవి సుబ్బారావు

జనవరి 21నుండి ఏపీపీఎస్సీ అభ్యర్థులకు శిక్షణా తరగతులు ప్రారంభించామని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు అన్నారు. పొదిలి టైమ్స్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ ఒంగోలులోని జిల్లా గ్రంధాలయంలో 45రోజులపాటు జరిగే ఏపీపీఎస్సీ గ్రూప్1, గ్రూప్2, గ్రూప్3 కి సంబంధించి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఈ సదవకాశమని అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.