కొత్త నోట్లుకు సంబంధించి సంచలన ప్రకటన చేసిన ఆర్బీఐ

నోట్ల రద్దు నేపథ్యంలో విడుదల చేసిన కొత్త 200, 2000 నోట్లకు సంబంధించి ఆర్బీఐ తాజాగా కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. పొరపాటున కొత్త నోట్లు చిరిగిపోతే వాటిని బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవడం ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారింది. పలు కారణాలను పేర్కొంటూ బ్యాంకులు చిరిగిన నోట్లను తీసుకోవడానికి తిరస్కరిస్తున్నాయి. దీంతో చిరిగిన నోట్లను మార్పిడి చేసుకునే విషయంలో ఆర్బీఐ కొన్ని నిబంధనలు జారీ చేసింది. ఆర్బీఐ పేర్కొన్న నిబంధనల ప్రకారం.. చిరిగిన నోట్ల మార్పిడి అనే అంశం నోటు చిరిగిన ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. 200నోటు చిరిగిన ప్రదేశం 39 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుండా ఉంటే మార్పిడి సమయంలో పూర్తి స్థాయిలో రిఫండ్ పొందొచ్చు. 78స్క్వేర్ సెంటీమీటర్ల మేర నోటు చిరగకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే పూర్తి స్థాయి రిఫండ్ లభిస్తుంది. 2వేల నోటుకు సంబంధించి చిరిగిన ప్రదేశం 44 స్క్వేర్ సెంటీమీటర్లకు మించకుడదు. 88స్క్వేర్ సెంటీమీటర్లు నోటు చిరగకూడదు. 2వేల నోటు పూర్తి వైశాల్యం 109.56 స్క్వేర్ సెంటీమీటర్లు.